టంగుటూరికి నివాళులు అర్పించిన ఎస్పీ దామోదర్

టంగుటూరికి నివాళులు అర్పించిన ఎస్పీ దామోదర్

ప్రకాశం: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ టంగుటూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఎస్పీ కార్యాలయంలోని పోలీసు సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.