పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
వరంగల్ రైల్వే స్టేషన్లో మహిళా ప్రయాణికురాలు పోగొట్టుకున్న సెల్ ఫోన్ను రైల్వే పోలీసులు గుర్తించి తిరిగి అప్పగించారు. మంగళవారం కాజీపేట బాపూజీనగర్కు చెందిన సాజిదా కేసముద్రం వెళ్లేందుకు స్టేషన్కు రాగా, ప్లాట్ఫాం నంబర్-1పై రూ.18 వేల విలువైన సెల్ ఫోన్ను పోగొట్టుకుంది. ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు దానిని గుర్తించి తిరిగి ఆమెకు అందజేశారు.