ఈనెల 15 నుంచి గాలికుంటు టీకా పంపిణీ: కలెక్టర్ రాజాబాబు

ప్రకాశం: జాతీయ పశువ్యాధుల నియంత్రణ పథకం కింద, ఒంగోలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుంచి నెల రోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. శనివారం ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో ఒకటైన గాలికుంటును అరికట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.