సీఎంతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బ్రేక్ఫాస్ట్ మీటింగ్
NLG: హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పౌరసరఫరాలు, ఆహార భద్రత, పునరుత్పాదక ఇంధన రంగాలపై చర్చ జరిగినట్లు సమాచారం.