బ్రహ్మంగారి మఠంలో స్వచ్ఛ భారత్
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్ల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ డా.డీ.ఎల్ రవీంద్రారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.కే వల్లి నిర్వహణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముండ్లపాటి చంద్ర శేఖర్, కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.