ప్రజలకు సేవలు సులభంగా అందాలి: కమిషనర్
KRNL: నగరపాలక సేవలు ప్రజలకు సులభంగా అందేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కమిషనర్ పీ.విశ్వనాథ్ అన్నారు. సోమవారం ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీలకు సంబంధించి 19 ఫిర్యాదులను స్వీకరించిన కమిషనర్, సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.