కడపలో నిరసన చేపట్టిన అఖిలపక్ష నేతలు
కడప మున్సిపల్ కార్పొరేషన్ వద్ద అఖిలపక్ష నేతలు నిరసన చేపట్టి కమిషనర్కు వినతి సమర్పించారు. చిన్న పన్ను దారులను వేధించకుండా పెద్ద మొత్తాల మొండి బకాయిలను వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అనతి కాలంలో 60 కోట్ల వసూళ్లు చేసిన కమిషనర్ను అభినందించారు. ప్రభుత్వ శాఖల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జనరల్ ఫండ్ను మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు.