రెండు కేజీల గంజాయి పట్టివేత
శ్రీకాకుళం రూరల్ మండలం మడపాం వంతెన ఇసుక ర్యాంప్ వద్ద 2 కేజీల గంజాయితో బగ్గు నవీన్, అమర్నాయక్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. రూరల్ ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి, మత్తు పదార్థాలు నిల్వ , రవాణా చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.