ర్యాగట్లపల్లి సర్పంచ్గా BRS అభ్యర్థి విజయం
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కొద్ది తేడాతోనే అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామంలో BRS బలపరిచిన ధర్మగారి భాగ్యమ్మ 5 ఓట్ల తేడాతో సర్పంచ్గా సమీప అభ్యర్థి లక్ష్మిపై విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.