VIDEO: ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు: కిలాడీ అరెస్ట్
SRPT: ప్రభుత్వ ఉద్యోగాలు, బదిలీల పేరిట అమాయకులను నిలువునా ముంచిన రఘురామ్ అనే కేటుగాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 60 మంది బాధితుల నుంచి రూ.1.85 కోట్లు వసూలు చేసి నకిలీ ఆర్డర్లు సృష్టించినట్లు సీఐ వెంకట్ తెలిపారు. నియామకాలు ఆన్లైన్ ద్వారానే జరుగుతాయని, మోసగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.