ఖమ్మం నగరంలో క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యవేక్షణ
ఖమ్మం నగరంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక అమలును మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఆయన వివిధ డివిజన్లలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. నగరంలో పారిశుధ్య పనులను మిషన్ మోడ్లో నిర్వహించాలని, ముఖ్యంగా ఖాళీ ప్లాట్లలో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు.