కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తహసీల్దార్కు వినతి
PDPL: ఓదెల మండలంలో మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ ధీరాజ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. 70% కోతలు పూర్తయినా కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.