ప్రారంభమైన పోలింగ్
VKB: జిల్లాలో తాండూరు, బషిరాబాద్, యూలాల, పెద్దేమూల్, కొండగల్, దౌల్తాబాద్, బొమ్రాస్పేట, దుద్యాల్ మండలాలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.