'తాగునీటి సమస్యను పరిష్కరించాలి'

'తాగునీటి సమస్యను పరిష్కరించాలి'

AKP: రాంబిల్లి మండలం మూలజంప ఎస్సీ కాలనీ, గొల్ల వీధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మండల టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ అందుకూరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనకాపల్లి క్యాంపు కార్యాలయంలో ఎంపీ సీఎం రమేష్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఒక బోరు, వాటర్ ట్యాంకు మంజూరు చేయాలని కోరారు.