బోడపాడులో పేకాట శిబిరంపై దాడి 14 మంది అరెస్ట్
ప్రకాశం: మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో 14 మందిని తీసుకొని వారి వద్ద నుండి రూ.55,860 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పగించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని అన్నారు.