తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా.. నిన్న శ్రీవారిని 66,389 మంది భక్తులు దర్శించుకోగా.. 24,956 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే, రూ.3.81 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.