శ్రీ మఠంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు

శ్రీ మఠంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు

కర్నూలు: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు పీఠాధిపతి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా గురువారం మూల బృందావనానికి అర్చకులు పంచామృతాభిషేకం మరియు వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా మాంచాల దేవిని దర్శించుకుని అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.