అండర్ పాస్ ఏర్పాటు చేయండి.. ఎంపీకి విన్నపం

అండర్ పాస్ ఏర్పాటు చేయండి.. ఎంపీకి విన్నపం

MBNR: రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మించాలని కోరుతూ రాయపల్లి సర్పంచ్ గాయత్రి మల్లేశ్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం అందజేశారు. బ్రిడ్జి నిర్మాణంతో స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్ అవసరమని వివరించారు. అలాగే రాయపల్లి గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేయాలని వారు కోరారు.