VIDEO: 'వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టండి'
BHPL: గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం నుంచి ములుగు జిల్లాకు వెళ్ళే ప్రధాన రహదారి SRSP బ్రిడ్జి వద్ద పెద్దగుంత ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలు కనబడక ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.