11 మందికి సీఎంఆర్ఎఫ్ అందజేసిన ఎమ్మెల్యే
BPT: చుండూరు మండలానికి చెందిన 11 మంది అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందగా, వారి వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను రిఫరెన్స్ లెటర్ల ద్వారా సీఎం సహాయ నిధి కార్యాలయానికి పంపించారు. పరిశీలన అనంతరం మొత్తం రూ.3,31,199 మంజూరు అయిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు.