రామగుండం-3 టెండర్లపై మంత్రికి కార్మికుల వినతి
పెద్దపల్లి: రామగుండం-3 జీఎం కార్యాలయంలో బాయ్స్ టెండర్లను 19 మందికి బదులుగా 12మందికి పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) ప్రతినిధులు శనివారం మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. 19 మందికి టెండర్ అమలు చేయాలని సింగరేణి జీఎంను ఆదేశించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్మికులు ఉన్నారు.