కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు
AKP: వైసీపీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. మంగళవారం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జెడ్పీటీసీ కాసులమ్మ, మాజీ సర్పంచ్ పిక్కి రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు.