కోట్లతో రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం
VKB: జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పాత రైల్వే బ్రిడ్జి స్థానంలో రూ.96 కోట్లతో చేపడుతున్న కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు చురుకుగా సాగుతున్నాయి. త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.