నేడే కార్తీక మాసం చివరి సోమవారం
పవిత్ర కార్తీక మాసంలో ఈ రోజు చివరి సోమవారం. ఈ విశిష్టమైన దినాన భక్తిశ్రద్ధలతో శివారాధన చేసిన భక్తులకు కోటి సోమవారాల పుణ్య ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయాన్ని సందర్శించి.. శివుడికి రుద్రాభిషేకం, బిల్వ పత్రాలు సమర్పించడం అత్యంత శుభప్రదం. ఇంటి వద్ద దీపారాధన చేసినా శివానుగ్రహం లభించి, భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు.