'అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఊపిరి'
KRNL: రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ అమరావతికి పూర్తి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఊపిరి అన్నారు.