శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సేవలో మాజీ ఎమ్మెల్యే

TPT: చిట్టమూరు మండలంలోని మల్లాంలో వెలసి ఉన్న సుప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శనివారం సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో YCP నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి పాల్గొన్నారు.