స్కీమ్ల పేరుతో స్కామ్లు చేశారు: ధూళిపాళ్ల

AP: గత ఐదేళ్లలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోయారని MLA ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. YCP పెద్దల వల్ల కొన్ని పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లాయన్నారు. మాజీ MP గల్లా జయదేవ్ తెలంగాణకు వెళ్లి పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు. YCP నాయకులు పేదల ఇళ్ల పట్టాలను దోపిడీ చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో స్కీమ్ల పేరుతో స్కామ్లు చేశారని ధ్వజమెత్తారు.