VIDEO: ప్రజా వైద్యం ప్రజల హక్కు: దీపిక
SS: ప్రజా వైద్యం పట్ల పోరాడే హక్కు ప్రజలకు ఉందని హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ దీపిక పేర్కొన్నారు. బుధవారం హిందూపురం వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ హిందూపురం నియోజకవర్గంలో ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారని తెలిపారు. ఈనెల 17న మాజీ సీఎం జగన్ గవర్నర్ను కలసి ఈ పుస్తకాలు అందజేస్తారని తెలిపారు.