'గోల్డెన్ అవర్'పై అవగాహన కార్యక్రమం
NRPT: ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రిలో చేర్చడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని శుక్రవారం టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై సతీశ్ రెడ్డి అన్నారు. 'అరైవ్, అలైవ్' కార్యక్రమంలో భాగంగా నారాయణపేట పట్టణంలోని అంబేడ్కర్ భవన్, మండల పరిధిలోని అప్పక్పల్లి వద్ద అంబులెన్స్, ఇతర వాహనాల డ్రైవర్లకు గోల్డెన్ అవర్పై అవగాహన కల్పించారు.