భవన నిర్మాణ యజమానికి భారీ ఫైన్
VSP: పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంపై జివిఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కఠిన చర్యలు చేపట్టారు. ఉత్తర జోన్ వార్డు నెం. 25లో తనిఖీల సందర్భంగా రహదారులపై నిర్మాణ వ్యర్థాలను పడేసిన భవన యజమానికి రూ. 25,000 జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశంలో చెత్త పారబోసిన ఒక వ్యాపార సంస్థను సీజ్ చేశారు. పారిశుధ్య విషయంలో అలక్ష్యం సహించబోమని హెచ్చరించారు.