క్రీడల్లో గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రతిభ

క్రీడల్లో గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రతిభ

JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామంలో జరుగుతున్న ఎస్టీఎఫ్ మండల స్థాయి క్రీడల్లో మెట్‌పల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కబడ్డీ అండర్-14, అండర్ –17 విభాగాల్లో మొదటి స్థానం సాధించగా, అథ్లెటిక్స్ విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని ప్రిన్సిపల్ జుబేర్, ఏటీపీ సరిత, పీఈటి ప్రశాంత్‌లు అభినందించారు.