రేపు ఉచిత కంటి వైద్య శిబిరం
CTR: పుంగనూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మునస్వామి మొదలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందన్నారు. శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నుంచి వైద్యులు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలిపారు.