సివిల్స్ పరీక్షలకు రికార్డు స్థాయిలో హాజరు

సివిల్స్ పరీక్షలకు రికార్డు స్థాయిలో హాజరు

చైనాలో సివిల్స్ పరీక్షలకు భారీగా స్పందన లభించింది. అర్హత వయసును 35 నుంచి 38 ఏళ్లకు పెంచడంతో 37 లక్షల మంది హాజరయ్యారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి పెరిగి, ఒక్కో పోస్టుకు సగటున 98 మంది పోటీ పడుతున్నారు. మొత్తం ఖాళీల్లో 70% కొత్త గ్రాడ్యుయేట్లకు కేటాయించారు. చైనాలో ఏటా 1.2 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేస్తున్నారు.