పుట్టపర్తి ఎయిర్పోర్టు దగ్గర ఉద్రిక్తత
AP: పుట్టపర్తి ఎయిర్పోర్టు దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి లోకేష్ రాక సందర్భంగా టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడిని ఎయిర్పోర్టుకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ప్రకాష్ నాయుడు వాగ్వాదానికి దిగారు.