జాతర మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తజనం

జాతర మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తజనం

SRD: పటాన్ చెరు మండలం భానూరు పరిధిలోని కంచర్ల గూడెంలో ఆదివారం జరిగిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి–చిత్తారమ్మ కళ్యాణ మహోత్సవం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామీణ జాతరలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడతాయని నిర్వాహకులు తెలిపారు.