గ్రామంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం

గ్రామంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం

SRD: బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో బుధవారం ఆర్థిక అక్షరాస్య కేంద్రం, ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలు, పొదుపు అలవాట్లు, ఇన్సూరెన్స్ పథకాల ప్రాముఖ్యతతో పాటు సైబర్ మోసాలపై జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో బ్యాంక్ ఏబీఎం మోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.