రైల్వేట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
NZB: రైల్వేట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన జానకంపేట్ నుంచి నవీపేట్ వెళ్లే దారిలో చోటు చేసుకుంది. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ శుక్రవారం తెలిపారు. జానకంపేట్ నుంచి నవీపేట్ మండలానికి వెళ్లే దారిలో రైల్వేట్రాక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.