విదేశాల్లో 18 లక్షల మంది భారతీయ విద్యార్థులు

విదేశాల్లో చదువుకునే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. 2023లో 13 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతుండగా.. ఈ ఏడాది వీరి సంఖ్య 18 లక్షలకు చేరినట్లు పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది కెనడా, యూకే వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఆ దేశాలు అందించే విద్యా అవకాశాలు, వలస విధానాల వల్లే అక్కడికి ఆకర్షితులవుతున్నట్లు చెప్పింది.