సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
BPT: వేమూరు నియోజకవర్గంలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భట్టిప్రోలు-సురేపల్లి వద్ద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రైతుల సభ జరగనుంది. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంగళవారం పరిశీలించారు. వేదిక, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.