బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సినీ నిర్మాత
KMR: నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 2 రోజుకు చేరాయి. దేవనాథ జీయర్ స్వామి మాట్లాడుతూ.. నమ్మకంతో దేవుడిని కొలిస్తే అసాధ్యమైన కోరికలు కూడా నెరవేరుతాయని తెలిపారు. లోక కల్యాణం కోసమే బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారని, భక్తుల మొక్కులను గరుత్మంతుడు స్వామివారికి చేరవేస్తాడని వివరించారు. ఈ వేడుకల్లో ధర్మకర్తలు సినీ నిర్మాత దిల్ రాజు ఉన్నారు.