ఇంటి పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

ఇంటి పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

AKP: ఎస్ రాయవరం మండలంలో రూ.2,54,99,134 వసూళ్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,26,46,557 వసూళ్లు చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదివారం తెలిపారు. దార్లపూడి, చినగుమ్ములూరు, తిమ్మాపురం, కొరుప్రోలు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రజలు చెల్లించే ఇంటి పన్నులు ద్వారా కనీస సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు.