పల్లె పోరు.. ఒక్క ఓటుతో గెలుపు
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాలలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి బుచ్చిరెడ్డి సర్పంచ్గా గెలిచారు. బీఆర్ఎస్ మద్దతుదారు కాంత్రెడ్డిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్గా ఉపేంద్రమ్మ గెలుపొందారు. డ్రాలో కాంగ్రెస్ మద్దతుదారు ఉపేంద్రమ్మను అదృష్టం వరించింది.