లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శనివారం రూ. 4,16,620 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ. 2,07,060లు రాగా, ప్రసాదాల ద్వారా రూ. 1,07,245లు, అన్నదానం ద్వారా రూ. 1,02,315లు వచ్చినట్లు ఆలయ కార్యాలయం కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.