VIDEO: మంత్రి శ్రీహరిని కలిసిన నికత్ జరీన్
HYD: గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ బాక్సర్ నికత్ జరీన్ ఇవాళ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. మంత్రి శ్రీహరి ఆమెను శాలువాతో సన్మానించి, అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడాకారులకు అన్ని రకాల భరోసా ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.