నందవరంలో బీజేపీ జెండా వివాదం..!
KRNL: నందవరం మండలంలో బీజేపీ జెండా కట్టను ఏర్పాటు చేయడానికి వచ్చిన బీజేపీ నాయకుడు గురూరాజ్ దేశాయ్ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారని బీజేపీ నేతలు ఇవాళ ఆరోపించారు. జెండా కట్ట వద్దని బెదిరింపులకు గురిచేశారని, కూటమి ధర్మాలను టీడీపీ ఉల్లంఘించిందని విమర్శించారు. ఈ ఘటనపై నందవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని మండిపడ్డారు.