అవినీతి చట్టబద్ధత కోసమే తీర్మానం: వెంకటరామిరెడ్డి
ATP: అమరావతిలో అవినీతికి చట్టబద్ధత కల్పించుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం చేశారని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. వేల కోట్లు అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు అంశాలపై తీర్మానం చేయకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు.