కలెక్టరేట్లో నేడు ప్రజావేదిక కార్యక్రమం
ATP: జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జేసీతోపాటు జిల్లా అధికారులు పాల్గొననున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ అర్జీలను సమర్పించుకోవచ్చని, గతంలో ఇచ్చిన అర్జీల రసీదులు వెంట తీసుకురావాలని ఆయన సూచించారు.