పిడుగుపాటు గురైన వ్యక్తికి చికిత్స

పిడుగుపాటు గురైన వ్యక్తికి చికిత్స

ప్రకాశం: పొన్నలూరు సమీపంలోని ఏటి ప్రాంతంలో సోమవారం సాయంత్రం కురిసిన ఆకాల వర్షానికి పిడుగు పడి చుండి శ్యామ్యూల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని మెరుగైన చికిత్స కోసం మంగళవారం ఒంగోలు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు పేర్కొన్నారు.