యువకుడిపై 15 మంది దుండగుల దాడి

యువకుడిపై 15 మంది దుండగుల దాడి

అన్నమయ్య: మదనపల్లెలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఎస్టేట్ సమీపంలోని దాము వైన్స్‌లో మద్యం తాగేందుకు వెళ్లిన శివసాయి(28) అనే యువకుడిపై సుమారు 15 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. మద్యం షాపు వద్ద జరిగిన చిన్న వివాదం కారణంగా ఆగ్రహించిన దుండగులు బీరు బాటిళ్లతో శివసాయి తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.