BREAKING: బైక్ను ఢీకొట్టిన మాజీ మంత్రి కారు
సత్యసాయి: మండలకేంద్రమైన ధర్మవరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారు ఓ బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులకు, వారి చిన్నారికి గాయాలయ్యాయి. కారు దిగి చూసి రఘునాథరెడ్డి వెళ్లిపోయారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.